అక్టోబరు 31న మునుగోడులో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ముఖ్య అతిథిగా జరగాల్సిన బీజేపీ భారీ బహిరంగ సభ రద్దయినట్టు తెలుస్తుంది. మునుగోడులో బీజేపీ సభ రద్దుకు సంబంధించి అధికారిక కారణాలేవీ ఇంకా వెల్లడించలేదు. మునుగోడు ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా అక్టోబర్ 31న మునుగోడులో జేపీ నడ్డా అధ్యక్షతన భారీ బహిరంగ సభ నిర్వహించి, ఎన్నికల ప్రచారాన్ని తారాస్థాయికి తీసుకెళ్లాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ ఇటీవలే నిర్ణయించింది. సభకు అనుమతులు మరియు రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఈ నెల 31న మునుగోడు నియోజకవర్గంలో బీజేపీ తలపెట్టిన సభ రద్దయినట్టుగా ప్రచారం సాగుతుంది.
అయితే భారీ సభ రద్దు నేపథ్యంలో ఈ నెల 31న మునుగోడు నియోజకవర్గంలోని 7 మండల కేంద్రాలు, రెండు మున్సిపాలిటీల్లో ఒకేసారిగా 9 సభలు నిర్వహించి, ప్రచారాన్ని పెద్దఎత్తున సాగించాలని బీజేపీ నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. ఈ సభలపై బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ ఛుగ్ శనివారం మునుగోడుకు చేరుకొని రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే ప్రచారం చివరి రోజైన నవంబర్ 1న అన్ని గ్రామాల్లో బైక్ ర్యాలీలు, సమావేశాలు నిర్వహించాలని బీజేపీ ప్రణాళికలు రూపొందిస్తుంది. మరోవైపు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ ధర్మపురి అరవింద్, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు సహా రాష్ట్రస్థాయి నేతలంతా గత కొన్ని రోజుల నుంచి మునుగోడు నియోజకవర్గంలోనే మకాం వేసి గ్రామాల్లో ప్రజలను కలుసుకుంటూ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE