ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) శాఖ అధ్యక్షుడిగా మాజీ ఐఏఎస్ తోట చంద్రశేఖర్ ను నియమిస్తూ ఇటీవలే ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తోట చంద్రశేఖర్ బుధవారం ప్రగతి భవన్ లో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. తనను ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షునిగా నియమించినందుకు మరోసారి సీఎం కేసీఆర్ కు తోట చంద్రశేఖర్ కృతజ్జతలు తెలిపారు.
ఈ సందర్భంగా ఏపీలో పార్టీ పటిష్టత, తదితర అంశాలపై చర్చించారు. ఏపీలో త్వరలోనే బీఆర్ఎస్ ఆవిర్భావ సభ నిర్వహణ, పార్టీ విస్తరణ, సభ్యత్వ నమోదు, గ్రామాలు, మండలాలు, జిల్లాల్లో కమిటీల ఏర్పాటు, పార్టీలో పలువురి చేరికలుపై సీఎం కేసీఆర్ తోట చంద్రశేఖర్ కు సూచనలు చేసినట్టు తెలుస్తుంది. ఈ సమావేశంలో బీఆర్ఎస్ ఏపీ నేత చింతల పార్థసారథి తదితరులున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE