బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత కాలుకి గాయం అయింది. మంగళవారం తన కాలికి గాయమైనట్లు ఆమె స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేస్త.. ‘నా కాలికి గాయమైంది. గాయం తీవ్రత దృష్ట్యా మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఏదైనా సమాచారం లేదా సహాయం కోసం నా కార్యాలయం అందుబాటులో ఉంటుంది’ అని పేర్కొన్నారు. కాగా గాయం కారణంగా కవిత కొద్దిరోజులుగా రాజకీయ సమావేశాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే నేతలు, కార్యకర్తలకు జూమ్ మీటింగ్లో ఆమె అందుబాటులో ఉండే అవకాశం ఉంది. కవిత గాయపడిన విషయం తెలుసుకున్న అభిమానులు, కార్యకర్తలు ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.
Due to Avulsion fracture, I have been advised bed rest for 3 weeks.
My @OfficeOfKavitha shall be available for any assistance or communication.
— Kavitha Kalvakuntla (@RaoKavitha) April 11, 2023
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE