తెలంగాణ రాష్ట్ర గిరిజన సహకార ఆర్థిక అభివృద్ధి సంస్థ చైర్మన్ గా నల్గొండ జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు ఇస్లావత్ రామ్ చందర్ నాయక్ ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నియమించారు. సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు ఇస్లావత్ రామ్ చందర్ నాయక్ నియామకంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో తన నియామక పత్రాన్ని గురువారం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా రామ్ చందర్ నాయక్ అందుకున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు రామ్ చందర్ నాయక్ ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు, నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర గిరిజన సహకార ఆర్థిక అభివృద్ధి సంస్థ చైర్మన్ పదవీలో రామ్ చందర్ నాయక్ రెండేళ్లపాటుగా కొనసాగనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY