తెలంగాణ రాష్ట్ర మైనారిటీస్ కమిషన్ ఛైర్మన్ గా తారిఖ్ అన్సారీని నియమిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్నారు. సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు తారిఖ్ అన్సారీ నియామకంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను తారిఖ్ అన్సారీ కలిశారు. తన నియామక పత్రాన్ని సీఎం కేసీఆర్ చేతుల మీదుగా తారిఖ్ అన్సారీ అందుకున్నారు. ఈ సందర్భంగా తనను తెలంగాణ రాష్ట్ర మైనార్టీ కమిషన్ ఛైర్మన్ గా నియమించినందుకు సీఎం కేసీఆర్ కు తారిఖ్ అన్సారీ కృతజ్ఞతలు తెలిపారు. బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి తారిఖ్ అన్సారీ ఈ పదవిలో మూడేండ్ల పాటుగా కొనసాగనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE