తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 2023, జనవరి 18వ తేదీ నుంచి కంటివెలుగు కార్యక్రమాన్ని నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. కంటి వెలుగు కార్యక్రమ అమలు తీరు, తదితర ప్రజారోగ్యం, వైద్యం అంశాలపై, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు, ఇతర శాఖల మంత్రులు, ప్రజాప్రతినిధులు, వైద్య శాఖ ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, ‘‘గతంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నిర్వహించిన కంటి వెలుగు కార్యక్రమం ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్నది. ముఖ్యంగా తమ కంటి చూపు కోల్పోయిన పేదలైన వృద్ధులకు కంటి వెలుగు పథకం ద్వారా కంటి చూపు అందింది. రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా పరీక్షలు చేసి కండ్లజోడులు అందించింది. తద్వారా వారు పొందిన ఆనందానికి అవధులు లేవు. పేదల కన్నుల్లో వెలుగులు నింపి వారి ఆనందాన్ని పంచుకోవడం గొప్ప విషయం. గతంలో అందించిన మాదిరిగానే రాష్ట్రవ్యాప్తంగా కంటి వెలుగు పథకం ద్వారా కంటి పరీక్షలు నిర్వహించి కావాల్సిన వారందరికీ ఉచితంగా కంటి అద్దాలు అందిస్తాం’’ అని సీఎం స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన సిబ్బందిని, కండ్లద్దాలు పరికరాలు తదితర అవసరమైన వ్యవస్తలను ఏర్పాటు చేసుకోవాలని సీఎం సూచించారు.
ముందుగా తెలంగాణ రాష్ట్రంలో 2018, ఆగస్టు 15న మెదక్ జిల్లా మల్కాపూర్లో కంటి వెలుగు కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం కింద కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి పరీక్షలు చేసి, కళ్లద్దాలు అందించడంతో పాటుగా మందులు పంపిణీ చేశారు. విజయవంతమైన ఈ కంటి వెలుగు కార్యక్రమాన్ని మరోసారి రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ తాజాగా నిర్ణయం తీసుకున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE