రేపటి నుంచి (డిసెంబర్ 7, బుధవారం) నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ లోక్సభ, రాభ్యసభ పక్ష నేతలు నామా నాగేశ్వరరావు, కె.కేశవరావుతో పాటుగా పలువురు ఎంపీలతో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సోమవారం ప్రగతిభవన్ లో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పార్లమెంట్ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన విధివిధానాలు, లేవనెత్తాల్సిన అంశాలు, వ్యూహంపై కీలకంగా చర్చించి సీఎం కేసీఆర్ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు, తెలంగాణ రాష్ట్రం పట్ల పలు రంగాల్లో కేంద్రం చూపిస్తున్న వివక్షపై పోరాడాలని, దేశానికి తెలిపేలా ఎండగట్టాలని ఎంపీలకు సీఎం కేసీఆర్ పిలుపు ఇచ్చినట్టు తెలుస్తుంది. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన హామీలు, ఎమ్మెల్యేలకు ఎర అంశం, రుణాలు పొందే విషయంలోనూ ఆంక్షలు విధించడం, కేంద్రం ప్రవేశపెట్టే బిల్లులపై అధ్యయనం చేసి వ్యవహరించాల్సిన తీరు సహా రాష్ట్ర సంబంధిత అంశాలను పార్లమెంటు ఉభయ సభల్లో లేవనెత్తి, కేంద్రం అనుసరిస్తున్న కక్షపూరిత విధానాలను నిలదీస్తూ గళం విప్పాలని సీఎం కేసీఆర్ ఎంపీలకు దిశానిర్దేశం చేసినట్టు సమాచారం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE