తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నేడు సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ లో పర్యటిస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ లో సీఎం కేసీఆర్ నారాయణఖేడ్ కు చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముందుగా నారాయణఖేడ్ లో సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల ప్రాజెక్టులకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రూ.4427 కోట్ల నిర్మాణ వ్యయంతో ఈ ప్రాజెక్టులను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది.
సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల ప్రాజెక్టుల ద్వారా సంగారెడ్డి, నారాయణఖేడ్, జహీరాబాద్, ఆందోల్ నియోజవకవర్గాల్లోని 3.84 లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్రావు, ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. శంకుస్థాపన కార్యక్రమం అనంతరం నారాయణఖేడ్ లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ