భారత్-చైనా సరిహద్దుల్లో లద్దాఖ్లోని గాల్వన్ లోయ వద్ద ఇరు దేశాల సైనికుల మధ్య తలెత్తిన ఘర్షణలో సూర్యాపేటకు చెందిన కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు వీర మరణం పొందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ఈ రోజు సూర్యాపేటకు వచ్చి సంతోష్బాబు కుటుంబ సభ్యులను పరామర్శించారు. విద్యానగర్ లోని కల్నల్ సంతోష్ బాబు నివాసానికి వెళ్లి, ఆయన చిత్రపటానికి సీఎం కేసీఆర్ పూలమాల వేసి నివాళులర్పించారు.
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రకటించిన విధంగా రూ.5 కోట్ల చెక్, నివాస స్థల పత్రాలను వారికీ అందజేశారు. అలాగే సంతోష్ బాబు భార్య సంతోషికి గ్రూప్-1 స్థాయి ఉద్యోగానికి సంబంధించిన నియామక పత్రాలను కూడా సీఎం కేసీఆర్ అందజేశారు. కల్నల్ కుటుంబాన్ని పరామర్శించిన వారిలో సీఎంతో పాటుగా రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి జగదీశ్రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ తదితరులు ఉన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu