ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్ లో నేటి (జూలై 13, మంగళవారం) మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర కేబినెట్ సమావేశం కానుంది. ఈ సమావేశం సందర్భంగా రాష్ట్రంలో కరోనా పరిస్థితి, వ్యవసాయం, పల్లె ప్రగతి, పట్టణప్రగతి తదితర అంశాలపై కేబినేట్ లో చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నట్టు తెలిపారు. కాగా రాష్ట్రంలో 50 వేల ఉద్యోగాల నియామక పక్రియ, ఏపీతో నెలకొన్న నీటి వివాదాలు, భూముల రిజిస్ట్రేషన్ ధరలు పెంపు, 57 సంవత్సరాల వారికి పెన్షన్ అందించడం, చేనేతలకు బీమా సౌకర్యం వంటి అంశాలపై కూడా చర్చ జరిగే అవకాశమునట్టు సమాచారం. గత జూన్ నెలలో కూడా 9, 19 తేదీల్లో తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశంపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ