తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఎల్లుండి (ఫిబ్రవరి 15, బుధవారం) కొండగట్టులో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సోమవారం సాయంత్రం జిల్లా అధికారులతో కలిసి కొండగట్టులో సీఎం కేసీఆర్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ పరిసరాలు, హెలిప్యాడ్ ను మంత్రి కొప్పుల సందర్శించారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పర్యటన ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను జిల్లా కలెక్టర్ యాసిన్ భాషా మంత్రి కొప్పుల ఈశ్వర్ కు వివరించారు. ఫిబ్రవరి 14, మంగళవారం మధ్యాహ్నం నుండి ఫిబ్రవరి 15, బుధవారం మధ్యాహ్నం సీఎం పర్యటన ముగిసే వరకు భక్తులను ఆలయ సందర్శన నిలిపివేస్తున్నట్లు చెప్పారు. ఏర్పాట్ల పరిశీలన కార్యక్రమంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ తో పాటుగా చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవి శంకర్, జిల్లా ఎస్పీ భాస్కర్, కొండగట్టు ఆలయ ఈవో వెంకటేష్ తో పాటు పలువురు జిల్లా, స్థానిక అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE