తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జూన్ 22, మంగళవారం నాడు యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రి గ్రామాన్ని సందర్శించనున్నారు. వాసాలమర్రి గ్రామాన్ని సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. మరికాసేపట్లో రోడ్డుమార్గంలో సీఎం కేసీఆర్ వాసాలమర్రి గ్రామానికి చేరుకోనున్నారు. ఈ గ్రామ సందర్శనలో భాగంగా గ్రామస్థులు అందరితో కలిసి సీఎం కేసీఆర్ సహపంక్తి భోజనం చేయనున్నారు.
అనంతరం గ్రామసభ ఏర్పాటు చేసి గ్రామంలోని సమస్యలపై చర్చించనున్నారు. ఇటీవలే ఈ పర్యటనకు సంబంధించి వాసాలమర్రి గ్రామ సర్పంచ్ అంజయ్యతో సీఎం కేసీఆర్ ఫోన్ లో మాట్లాడారు. జూన్ 22న వాసాలమర్రికి వస్తున్నానని, గ్రామసభ ఏర్పాటు చేసి సమస్యలపై చర్చిద్దామని, ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. మరోవైపు సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి వాసాలమర్రి గ్రామంలో చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వాసాలమర్రి గ్రామస్తులే పాల్గొనే విధంగా, అధికారులు ప్రత్యేకంగా పాసులు జారీ చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ