శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని మార్చి 30వ తేదీన భద్రాద్రి శ్రీసీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం, మార్చి 31న పుష్కర పట్టాభిషేకం వైభవంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించి, ఘనంగా ఏర్పాట్లు చేస్తుంది. ఈ నేపథ్యంలో శ్రీరామనవమి సందర్భంగా మార్చి 30న భద్రాచలంలో జరిగే శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొనాలని కోరుతూ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దంపతులను బుధవారం నాడు ప్రగతి భవన్ లో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటుగా ఆలయ ఈవో, పూజారులు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారంతా సీఎం కేసీఆర్ కు శాలువా కప్పి సత్కరించి, స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE