తెలంగాణలో ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో ఎక్కువుగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. జూలై 12, ఆదివారం సాయంత్రం 5 గంటల నాటికీ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 34,671 కి చేరుకుంది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధిక కేసులు నమోదవుతున్న ప్రాంతాల్లో మళ్ళీ పూర్తిస్థాయి కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేస్తున్నారు. 500 లకు పైగా కేసులు ఉన్న 8 ప్రాంతాలను హైరిస్క్ జోన్లుగా గుర్తించారు. ఈ హైరిస్క్ జోన్లలో స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి కరోనా నియంత్రం చర్యలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తుంది.
హైదరాబాద్లో హైరిస్క్ జోన్లుగా గుర్తించిన ప్రాంతాలు:
- యూసఫ్గూడ
- అంబర్పేట్
- మెహిదీపట్నం
- కార్వాన్
- చంద్రాయణ గుట్ట
- చార్మినార్
- రాజేంద్ర నగర్
- కుత్బుల్లాపూర్
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu