తెలంగాణ రాష్ట్రంలో మరో 872 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జూన్ 22, సోమవారం నాటికీ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8674 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. సోమవారం నాడు మొత్తం 3189 సాంపిల్స్ పరీక్షించినట్టు తెలిపారు. అలాగే కరోనా వలన ఏడుగురు మరణించడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 217 కి పెరిగినట్టు తెలిపారు. ఇక కొత్తగా కోవిడ్ నుంచి కోలుకున్న 274 మందితో కలిపి డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 4005 కి చేరింది. ప్రస్తుతం 4452 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు(872):
- జీహెచ్ఎంసీ ఏరియా – 713
- రంగారెడ్డి – 107
- మేడ్చల్ – 16
- సంగారెడ్డి – 12
- వరంగల్ రూరల్ – 6
- మంచిర్యాల – 5
- కామారెడ్డి – 3
- మెదక్ – 3
- జనగామ – 2
- కరీంనగర్ – 2
- మహబూబాబాద్ – 2
- వరంగల్ అర్బన్ – 1
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu