తెలంగాణ రాష్ట్రంలో మరో 983 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జూన్ 28, ఆదివారం నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 14419 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. ఆదివారం నాడు 3227 శాంపిల్స్ పరీక్షించినట్టు తెలిపారు. అలాగే కరోనా వలన మరో నలుగురు మరణించడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 247 కి పెరిగింది. కోవిడ్ నుంచి మరో 244 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 5172 కి చేరింది. ప్రస్తుతం 9000 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు(983):
- జీహెచ్ఎంసీ ఏరియా – 816
- రంగారెడ్డి – 47
- మంచిర్యాల – 33
- మేడ్చల్ – 29
- వరంగల్ రూరల్ – 19
- వరంగల్ అర్బన్ – 12
- భద్రాద్రి కొత్తగూడెం – 5
- నల్గొండ – 3
- కరీంనగర్ – 3
- సిద్ధిపేట – 3
- ఖమ్మం – 3
- గద్వాల్ – 2
- ఆదిలాబాద్ – 2
- సంగారెడ్డి – 1
- మహబూబ్ నగర్ – 1
- జనగామ – 1
- మెదక్ – 1
- సూర్యాపేట – 1
- నిజామాబాద్ – 1
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu