తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 596 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో డిసెంబర్ 4, శుక్రవారం రాత్రి 8 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,72,719 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. ఈ వైరస్ వలన మరణించిన వారి సంఖ్య 1470 కి పెరిగింది.
మరోవైపు కరోనా నుంచి కోలుకుని ఇప్పటివరకు 2,62,751 మంది సంపూర్ణ ఆరోగ్యంతో రికవరీ కాగా, గత 24 గంటల్లోనే 921 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 8,498 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇక రాష్ట్రంలో ఇప్పటికే కరోనా పరీక్షలు సంఖ్య 57 లక్షలు దాటింది. శుక్రవారం నాడు 59,471 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించడంతో మొత్తం పరీక్షల సంఖ్య 57,22,182 కు చేరుకుంది. రాష్ట్రంలో ప్రతి పది లక్షల జనాభాకు 1,53,739 పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ