తెలంగాణ పీసీసీ మాజీ కార్యదర్శి పాడి కౌశిక్ రెడ్డి బుధవారం నాడు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీలో చేరారు. తెలంగాణ భవన్ లో జరిగిన కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సమక్షంలో కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డికి గులాబీ కండువా కప్పి సీఎం కేసీఆర్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కౌశిక్ రెడ్డితో పాటుగా పలువురు నాయకులు, ఆయన అనుచరులు కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఇటీవలే కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావడానికి టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన కౌశిక్ రెడ్డికి, ఆయన అనుచరులకు స్వాగతం తెలిపారు. కౌశిక్రెడ్డి తండ్రి సాయినాథ్రెడ్డి తనతో కలిసి పనిచేశారని చెప్పారు. కౌశిక్ రెడ్డికి ఉజ్వల భవిష్యత్ కు హామీ ఇస్తున్నానని, ఆయన భవిష్యత్తుకు మంచి మార్గం ఏర్పాటు చేస్తానని సీఎం కేసీఆర్ తెలిపారు. ఇక తెలంగాణ దళిత బంధు పథకంపై విమర్శలు చేస్తున్నారని, అది ఎన్నికల కోసం తెచ్చింది కాదని చెప్పారు. ఈ పథకం కింద దళిత కుటుంబాలకు ప్రత్యేక రక్షణ నిధిగా రూ.10 లక్షల నగదు అందజేస్తామని చెప్పారు. రైతు బంధు, రైతు భీమా పథకాల లాగానే విజయవంతంగా అమలు చేస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ