తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలవేళ బీజేపీ-జనసేనల మధ్య పొత్తు వ్యవహారం కాక రేపుతోంది. రెండు పార్టీల మధ్య సీట్ల వ్యవహారం కొత్త చిచ్చు పెట్టింది. అసలు పొత్తు కంటే ముందే.. తెలంగాణలో 32 స్థానాల్లో పోటీ చేస్తామని జనసేనాని ప్రకటించారు. ఆయా స్థానాల పేర్లను కూడా వెల్లడించారు. ఆ తర్వాత అనూహ్యంగా పొత్తు వ్యవహారం తెరపైకి వచ్చింది. పొత్తు గురించి కిషన్ రెడ్డి.. పవన్ కల్యాణ్తో సంప్రదింపులు జరపడం.. ఆ తర్వాత ఇద్దరు కలిసి ఢిల్లీ పెద్దల వద్దకు వెళ్లడం చక చకా జరిగిపోయింది. ఒకటి రెండు రోజుల్లో రెండు పార్టీల మధ్య సీట్ల వ్యవహారం ఓ కొలిక్కి వస్తుందని అంతా భావించారు.
కానీ కనీసం 20 సీట్లు అయినా ఇవ్వాలని జనసేనాని పవన్ కల్యాణ్ పట్టుపట్టుకొని కూర్చున్నారు. అటు బీజేపీ మాత్రం 6 నుంచి 8 సీట్లు మాత్రమే ఇస్తామని చెప్పుకొచ్చింది. దీంతో సీట్ల పంపకం వ్యవహారం కొత్త చిచ్చుకు తెరతీసింది. రెండు పార్టీల మధ్య వివాదం తీసుకొచ్చింది. అటు సీట్ల వ్యవహారం ఎటూ తేలక ముందే పవన్ కల్యాణ్.. వరుణ్ తేజ్ పెళ్లికి ఇటలీ వెళ్లారు. దీంతో రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటుందా? లేదా? అసలు సీట్ల వ్యవహారం ఒక కొలిక్కి వస్తుందా? అనే సందేహాలు మొదలయ్యాయి.
అయితే ఇప్పుడు రెండు పార్టీలు ఒక అండర్ స్టాండింగ్కు వచ్చినట్లు తెలుస్తోంది. సీట్ల వ్యవహారం ఒక కొలిక్కి వచ్చినట్లు.. జనసేనకు ఇవ్వబోయే సీట్ల సంఖ్యను.. నియోజకవర్గాలను బీజేపీ అధిష్టానం ఫైనల్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అటూ.. ఇటూ కాకుండా 11 సీట్లు జనసేనకు ఇచ్చేందుకు బీజేపీ అధిష్టానం సిద్ధమయిందట. అంతేకాకుండా సీమాంధ్రులు ఎక్కువగా ఉండే కూకట్ పల్లి నియోజకవర్గాన్ని కూడా జనసేన కోసం వదులు కునేందుకు బీజేపీ రెడీ అయిందట.
ఇక మిగిలిన పది సీట్లను దాదాపు ఖమ్మం, నల్గొండ జిల్లాల్లోనే ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఆయా జిల్లాలు ఏపీతో సరిహద్దును పంచుకుంటున్నాయి. అక్కడ జనసేనను నిలబెడితే కలిసొస్తుందని బీజేపీ పెద్దలు భావిస్తున్నారట. అందుకే ఆ ప్రాంతంలో స్థానాలను జనసేనకు ఇవ్వాలని నిర్ణయించారట. దీనిపై ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటన రానుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE