రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు వరద ప్రభావిత, ముంపు ప్రాంతాల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, డాక్టర్లతో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్.ఏ.ఏం రిజ్వీ ఉన్నారు. వరద, ముంపుకు గురైన గోదావరి పరీవాహక ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా యుద్ధప్రాతిపదికన తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి సంబంధిత అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. ముంపు గ్రామాల్లో హెల్త్ క్యాంపులను ఏర్పాటు చేయాలన్నారు.
అలాగే వైద్యులు సెలవులు తీసుకోకుండా, తప్పనిసరిగా విధులకు హాజరయి ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంపుల్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. అవసరమైన మందులను ప్రజలకు అందుబాటులో ఉంచి సరఫరాచేయాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావును కొత్తగూడెం కేంద్రంగా, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ రమేశ్ రెడ్డిని మంచిర్యాల కేంద్రంగా విధులు నిర్వహిస్తూ హెల్త్ క్యాంపులు, తదితర ప్రజా ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాల్లో పాల్గొనాలని, అధికారులతో సమన్వయం చేసుకోవాలని మంత్రి హరీశ్ రావు ఆదేశించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY