బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రకు తెలంగాణ హైకోర్టు అనుమతి ఇచ్చింది. ముందుగా మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా బండి సంజయ్ చేపడుతున్న పాదయాత్రను ఆగస్టు 23 నుంచి నిలిపివేయాలని వర్దన్నపేట పోలీసులు నోటీసులు ఇచ్చారు. పాదయాత్ర పేరుతో ఆయన విద్వేషపూరిత ప్రకటనలు చేస్తున్నారని, ఈ చర్యలతో జనగామ జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉందని చెప్పారు. ప్రజా సంగ్రామ యాత్రను తక్షణమే నిలిపేయాలని ఆగస్టు 23న సంబంధిత బీజేపీ నేతలకు వర్దన్నపేట ఏసీపీ నోటీసులు ఇచ్చారు. అదేవిధంగా పాదయాత్రను కొనసాగిస్తే శాంతిభద్రతల సమస్య కింద చర్యలు తీసుకుంటామని నోటీసులో పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో పాదయాత్రను అనుమతించాలంటూ బీజేపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో, ఈ అంశంపై తెలంగాణ హైకోర్టు నేడు విచారణ చేపట్టింది. పాదయాత్ర ఆపాలంటూ పోలీసులు ఇచ్చిన నోటీసులు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని కోర్టు అభిప్రాయపడింది. దీంతో పోలీసుల నోటీసును సస్పెండ్ చేస్తూ, బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రకు కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో బండి సంజయ్ రేపటి నుంచి పాదయాత్రను తిరిగి ప్రారంభించనున్నారు. కాగా మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రను బండి సంజయ్ ఆగస్టు 27వ తేదీన వరంగల్ భద్రకాళీ ఆలయం వద్ద ముగించనున్నారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 27వ తేదీన హనుమకొండలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని తెలంగాణ బీజేపీ నిర్ణయించింది. హనుమకొండ, ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్స్ లో జరిగే పాదయాత్ర ముగింపు సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్టు ప్రకటించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY