హోలీ పండుగ నేపథ్యంలో హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల పరిధిలో రెండు రోజుల పాటుగా మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. పండుగ సందర్భంగా శాంతి భద్రతలు, ప్రశాంతతను దృష్టిలో ఉంచుకుని మార్చి 17, గురువారం సాయంత్రం 6 గంటల నుండి మార్చి 19, శనివారం ఉదయం 6 గంటల వరకు వైన్షాపులు, బార్లు, కల్లు దుకాణాలు మూసివేయనున్నారు. ఈ మేరకు ఆంక్షల విధింపుపై తెలంగాణ పోలీసులు బుధవారం నాడు ఆదేశాలు జారీ చేశారు.
అదేవిధంగా నగరంలో బహిరంగ ప్రదేశాల్లో హోలీ వేడుకలు నిర్వహించడంపై నిషేధం విధించారు. రంగులు లేదా రంగు నీరు చల్లడాన్ని ఇష్టపడని వ్యక్తులపై చల్లి అసౌకర్యం కలిగించడం, రోడ్లు, వాహనాలపై రంగులు చల్లడం, టూ వీలర్, ఇతర వాహనాలపై గుంపులుగా రోడ్లపై తిరగడం వంటి చర్యలను నిషేదిస్తునట్టు ప్రకటించారు. ఎవరైనా వ్యక్తులు ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే విచారణ ఎదుర్కొవాల్సి ఉంటుందని పోలీసులు తెలిపారు. మరోవైపు రెండు రోజుల పాటుగా మద్యం దుకాణాలు మూసివేస్తున్న నేపథ్యంలో మద్యం ప్రియులు బుధవారం సాయంత్రం నుంచే మద్యం దుకాణాల వద్ద పెద్ద సంఖ్యలో బారులు తీరారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ