ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. మొత్తం 403 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ సొంతంగానే 255 సీట్లను గెలుచుకోగా, ఇక బీజేపీ కూటమి మొత్తం 273 స్థానాలను కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో స్పష్టమైన మెజార్టీతో బీజేపీ కీలక నేత యోగి ఆదిత్యనాథ్ రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. హోలీ పండుగ అనంతరం మార్చి 21, సోమవారం నాడు యోగి ఆదిత్యనాథ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు తెలుస్తుంది.
యోగి ఆదిత్యనాథ్ ఇప్పటికే ఢిల్లీకి చేరుకొని ప్రమాణ స్వీకారం తేదీ, కేబినెట్ కూర్పు, ప్రముఖులకు ఆహ్వానం తదితర అంశాలపై బీజేపీ అగ్రనాయకత్వంతో చర్చించారు. ముందుగా యూపీలో 37 ఏళ్ల తరువాత అధికారం నిలబెట్టుకుని, వరుసగా రెండోసారి బాధ్యతలు చేపట్టనున్న ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ రికార్డ్ సృష్టించారు. 1985 లో ఎన్డీ తివారీ తర్వాత ఇప్పటివరకు మరెవరూ వెంటనే రెండోసారి ముఖ్యమంత్రిగా అధికారం దక్కించుకోలేక పోయారు. అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా పోటీ చేసిన యోగి ఆదిత్యనాథ్ గోరఖ్పూర్ అర్బన్ స్థానంలో 1,03,390 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ