ఇన్నోవేషన్, ఎంటర్ప్రెన్యూర్షిప్ను ప్రమోట్ చేయడంలో తెలంగాణ చాంపియన్ స్టేట్గా నిలుస్తోందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ మేరకు హైదరాబాద్లో జరిగిన మహీంద్రా యూనివర్సిటీ మొదటి స్నాతకోత్సవంలో మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భారత్ బయోటెక్ ఛైర్మన్, ఎండీ డాక్టర్ కృష్ణ ఎల్లా, మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా, టెక్ మహీంద్రా సీఈఓ, ఎండీ సిపి గుర్నాని, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ తదితరులు పాల్గొన్నారు.
IT and Industries Minister @KTRTRS participated as the Chief Guest at the @MahindraUni First Annual Convocation 2022 program in Hyderabad today. pic.twitter.com/clkvXftTd1
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) July 23, 2022
ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మంత్రి కేటీఆర్ ప్రసంగిస్తూ.. దేశ అభివృద్ధిలో యువత భాగస్వామ్యం కావాలని, ప్రస్తుత దేశ జనాభాలో సగానికి పైగా 27 ఏళ్ల వయసు వారేనని తెలిపారు. ఇక నాయకులు కూడా ఎప్పుడూ రాజకీయాలకే పరిమితం కాకుండా, ఆర్థిక అంశాలపై కూడా దృష్టి సారించి యువతకు సరైన మార్గం చూపించాలని సూచించారు. ఇక్కడివారు కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు మహీంద్రా యూనివర్సిటీలో చదువుతున్నారని, అయితే చదువులు ముగిశాక హైదరాబాద్లో ఉన్న ఉద్యోగ అవకాశాలను పరిశీలించాలని కోరారు. ఇతర రాష్ట్రాలు పోటీ పడలేనంతగా తెలంగాణకు పెట్టుబడుల ప్రవాహం వస్తోందని, అభివృద్ధిలో రాష్ట్రం దేశానికే రోల్ మోడల్గా నిలిచిందని చెప్పారు. ప్రజెంట్ జెనరేషన్ కొత్త కొత్త ఆవిష్కరణల్లో కీలకంగా భూమిక పోషిస్తోందని, అన్ని ప్రభుత్వాలు దీనిపై దృష్టి సారించి వారికి అపార అవకాశాలు కల్పించాలని మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ