తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా (సీజే) జస్టిస్ ఉజ్జల్ భూయాన్ నియమితులయ్యారు. ముందుగా ఇటీవలే సుప్రీంకోర్టు కొలీజియం తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ఉజ్జల్ భుయాన్ కు పదోన్నతి కల్పిస్తూ తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సిఫారసు చేసింది. ఈ నేపథ్యంలో ఈ నియామక సిఫార్సుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణతో సంప్రదించిన తర్వాత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేయడంతో ఆదివారం నాడు కేంద్ర న్యాయశాఖ గెజిట్ విడుదల చేసింది. కాగా ప్రస్తుత తెలంగాణ హైకోర్టు సీజే జస్టిస్ సతీష్ చంద్ర శర్మను ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా బదిలీ చేశారు.
అస్సాం రాష్ట్రానికి చెందిన జస్టిస్ ఉజ్జల్ భూయాన్ గువాహటిలోని ప్రభుత్వ న్యాయ కళాశాల నుంచి ఎల్ఎల్బీ, గువాహటీ విశ్వవిద్యాలయం నుంచి ఎల్ఎల్ఎం పూర్తి చేశారు. 2011లో గువాహటి హైకోర్టులో అదనపు ఏజీగా నియమితులైన ఆయన, అక్టోబర్ 17, 2011న గువాహటి హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమించబడ్డారు. ఇక అక్టోబర్ 3, 2019న బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ బదిలీ అయ్యారు. అనంతరం అక్టోబర్ 22, 2021న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీపై వచ్చారు. తాజాగా పదోన్నతిపై తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY