ఎట్టకేలకు గులాబీ బాస్ కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ నుంచి పోటీ చేసిన కేసీఆర్ భారీ మెజార్టీతో గెలుపొందారు. ఆ తర్వాత పలు కారణాల వల్ల ఆయన ప్రమాణస్వీకారం చేయలేదు. ఈక్రమంలో గురువారం అసెంబ్లీకి వెళ్లి కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. మధ్యాహ్నం 12.45 గంటలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ తన ఛాంబర్లో కేసీఆర్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేస్తుండడంతో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నేతలు, శ్రేణులు అసెంబ్లీకి తరలివచ్చారు.
నవంబర్ నెలాఖరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమిపాలయింది. కాంగ్రెస్ 64 స్థానాలు దక్కించుకోగా.. బీఆర్ఎస్ 39 స్థానాల్లో గెలుపు బావుటా ఎగురవేసింది. ఎన్నికల ఫలితాల తర్వాత తన ఫామ్హౌజ్కి వెళ్లిన కేసీఆర్ అక్కడ కాలు జారి కిందపడడంతో ఆయన తుంటికి గాయమయింది. సోమాజిగూడ యశోద ఆసుపత్రి వైద్యులు కేసీఆర్కు చికిత్స అందించారు. అప్పటి నుంచి కేసీఆర్ విశ్రాంతి తీసుకుంటున్నారు. డిసెంబర్లోనే కొత్త ఎమ్మెల్యేల చేత ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ ప్రమాణస్వీకారం చేయించారు.
ఆరోజు పలు కారణాల చేత హాజరుకాని ఎమ్మెల్యేల చేత కొద్దిరోజుల తర్వాత స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రమాణస్వీకారం చేయించారు. అయితే తుంటికి గాయం కావడంతో విశ్రాంతి తీసుకుంటున్నా కేసీఆర్ ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయలేదు. ఈక్రమంలో తాజాగా అసెంబ్లీకి వెళ్లి ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు.
KCR sir entering into Telangana Legislative Assembly
Jai Telangana pic.twitter.com/bCrtRwUfP7
— Krishank (@Krishank_BRS) February 1, 2024
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ