తెలంగాణ రాష్ట్రంలో 76వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి, ఆయన తల్లి అంజనాదేవి, నిర్మాత అల్లు అరవింద్, చిరంజీవి అభిమాన సంఘం అధ్యక్షుడు స్వామినాయుడు, పలువురు అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి తల్లి అంజనాదేవి జాతీయ జెండాను ఎగురవేశారు.
అనంతరం మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ, యావన్మంది భారతీయులకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్య్రం సిద్దించి 75 ఏళ్లు పూర్తికావడంతో ఈ వేడుకలు ప్రత్యేకమైనవని, భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలు జరుపుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. స్వాతంత్య్రం కోసం పోరాడిన సమరయోధులను, నాయకులను ఈ సందర్భంగా గుర్తుచేసుకుని, నివాళు అర్పించుకుంటున్నామని అన్నారు. స్వాతంత్య్ర పోరాటంలోకి వెళ్ళండి అంటూ వీరులను ప్రోత్సహించిన నిజమైన త్యాగమూర్తులు వారి కన్నతల్లులే అని చిరంజీవి అన్నారు. వారికీ నివాళులు అర్పించడం ధర్మంగా భావిస్తూ, తన తల్లి అంజనాదేవి చేత జాతీయ పతాక ఆవిష్కరణ చేయించడం సంతోషంగా ఉందని చిరంజీవి పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY