హుజూరాబాద్ నియోజకవర్గంలో త్వరలో ఉపఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. దీంతో అధికార టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నాయకుల పర్యటనలు, యాత్రలు క్రమంగా ఊపందుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం నాడు టీఆర్ఎస్ పార్టీ కీలక నేత, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు హుజూరాబాద్ లో పర్యటిస్తున్నారు. ముందుగా హుజూరాబాద్ పట్టణంలోని కేసి క్యాంపు నుండి మంత్రి గంగుల కమలాకర్ తో కలిసి హరీశ్ రావు బైక్ ర్యాలీలో వెళ్లారు. ఈ బైక్ ర్యాలీలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఈ పర్యటనలో భాగంగా ఇల్లందకుంటలో నిర్వహించే బహిరంగ సభలో మరియు వీణవంకలో మహిళా సంఘాలకు రూ.20 కోట్ల చెక్కుల పంపిణీ కార్యక్రమ సభలో మంత్రులు హరీశ్రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ పాల్గొనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ