తెలంగాణలోని నల్లగొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు సోమవారం కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ను విడుదల చేసిన నేపథ్యంలో అన్ని పార్టీల దృష్టి ఇప్పుడు దీనిపైనే నెలకొంది. ఇప్పటికే రాష్ట్రంలోని ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్నాయి. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తుండగా, మరోవైపు బీజేపీ మరియు అధికార టీఆర్ఎస్ పార్టీలు ఎలాగైనా గెలవాలని చూస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఈ ఉప ఎన్నికపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
మునుగోడులో జరిగే ఉపఎన్నికలో పోటీ ఎవరి నడుమ?
ఫ్లోరోసిస్ అనే భూతాన్ని నల్గొండ బిడ్డలకి శాపంలా ఇచ్చిన కాంగ్రెస్
ఫ్లోరోసిస్ నిర్ములనకు నీతి ఆయోగ్ సిఫార్సు చేసినా మిషన్ భగీరథకు పైసా ఇవ్వని మానవత్వం లేని బీజేపీ
ఫ్లోరోసిస్ నుండి శాశ్వతంగా మిషన్ భగీరథ ద్వారా శాపవిముక్తి చేసిన తెరాస
— KTR (@KTRTRS) October 3, 2022
మునుగోడులో జరిగే ఉప ఎన్నికలో పోటీ ఎవరి నడుమ ఉంటుందని ట్విట్టర్లో ప్రశ్నించారు. ఫ్లోరోసిస్ అనే భూతాన్ని నల్గొండ బిడ్డలకి శాపంలా ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తారా? లేక ఫ్లోరోసిస్ నిర్ములనకు నీతి ఆయోగ్ సిఫార్సు చేసినా మిషన్ భగీరథకు పైసా ఇవ్వని మానవత్వం లేని బీజేపీకి మద్దతిస్తారా? లేదంటే.. ఫ్లోరోసిస్ నుండి శాశ్వతంగా మిషన్ భగీరథ ద్వారా శాపవిముక్తి చేసిన టీఆర్ఎస్ పార్టీని సపోర్ట్ చేస్తారా? అని ఆయన పరోక్షంగా ప్రశ్నించారు. ఈ మూడు పార్టీల్లో పోటీ ఎవరి నడుమ ఉంటుందని ప్రజలను మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY