మునుగోడులో జరిగే ఉపఎన్నికలో పోటీ ఎవరి నడుమ? ప్రశ్నించిన మంత్రి కేటీఆర్

Minister KTR Interesting Comments Over Munugode Bypoll Competition Between TRS Congress and BJP, Munugode Bypoll Competition Between TRS And Congress and BJP, Minister KTR Interesting Comments, KTR Sensational Comments, Munugode Bypoll Competition, Munugode Bypoll, Munugode By-Election, TRS Party, Congress and BJP Party, Munugode Bypoll Competition News, Munugode Bypoll Competition Latest News And Updates, Munugode Bypoll Competition Live Updates, Mango News, Mango News Telugu

తెలంగాణలోని నల్లగొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు సోమవారం కేంద్ర ఎన్నికల క‌మిష‌న్ షెడ్యూల్‌ను విడుద‌ల చేసిన నేపథ్యంలో అన్ని పార్టీల దృష్టి ఇప్పుడు దీనిపైనే నెలకొంది. ఇప్పటికే రాష్ట్రంలోని ప్రధాన పార్టీలైన టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీలు ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్నాయి. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తుండగా, మరోవైపు బీజేపీ మరియు అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలు ఎలాగైనా గెలవాలని చూస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఈ ఉప ఎన్నిక‌పై టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌ వేదిక‌గా స్పందించారు.

మునుగోడులో జ‌రిగే ఉప ఎన్నిక‌లో పోటీ ఎవ‌రి న‌డుమ ఉంటుంద‌ని ట్విట్టర్‌లో ప్రశ్నించారు. ఫ్లోరోసిస్ అనే భూతాన్ని నల్గొండ బిడ్డలకి శాపంలా ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తారా? లేక ఫ్లోరోసిస్ నిర్ములనకు నీతి ఆయోగ్ సిఫార్సు చేసినా మిషన్ భగీరథకు పైసా ఇవ్వని మానవత్వం లేని బీజేపీకి మద్దతిస్తారా? లేదంటే.. ఫ్లోరోసిస్ నుండి శాశ్వతంగా మిషన్ భగీరథ ద్వారా శాపవిముక్తి చేసిన టీఆర్‌ఎస్‌ పార్టీని సపోర్ట్ చేస్తారా? అని ఆయన పరోక్షంగా ప్రశ్నించారు. ఈ మూడు పార్టీల్లో పోటీ ఎవ‌రి న‌డుమ ఉంటుంద‌ని ప్రజలను మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four + nine =