జనవరి 20న దావోస్‌ పర్యటనకు వెళ్లనున్న మంత్రి కేటీఆర్

KTR Latest News, KTR Participate In WEF, Mango News Telugu, Minister KTR Will Go To Davos, Political Updates 2020, telangana, Telangana Breaking News, Telangana Political Live Updates, Telangana Political Updates

తెలంగాణ ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కే.టి.రామారావు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం(డబ్ల్యుఇఎఫ్‌) వార్షిక సదస్సులో పాల్గొననున్నారు. జనవరి 21 నుంచి 24 వరకు ఈ సదస్సులో మంత్రి కేటీఆర్ పాల్గొంటారు. ఈ సదస్సుకు హాజరయ్యే ప్రపంచదేశాల పారిశ్రామికవేత్తలు, ఆర్థిక నిపుణులుకు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను మంత్రి కేటీఆర్ వివరించనున్నారు. ఈ సదస్సు సందర్భంగా ఐటీతో పాటుగా ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్, టెక్స్‌టైల్, లైఫ్ సైన్సెస్ వంటి రంగాలపై దృష్టి సారించనున్నట్టుగా తెలుస్తుంది. ఈ మేరకు జనవరి 20 నుంచి మంత్రి కేటీఆర్ విదేశీ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ సదస్సుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో పాటుగా పలు ప్రపంచదేశాల నాయకులు, ప్రతినిధులు హాజరుకానున్నారు.

ఈ పర్యటనపై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ, దావోస్‌కు సదస్సుకు వచ్చే ప్రతినిధులు ఒక నిర్దిష్ట ఉద్దేశ్యంతో వస్తారని, సమయం వృథా చేయకుండా నిర్ణయాల వైపుగా ముందుకు కదులుతారని అన్నారు. ఈసారి సమావేశాలకు షెడ్యూల్ రూపొందించుకున్నామని, ముఖ్యంగా ఐటీ రంగంలో ఫాలో-అప్‌లు చేయాల్సిన కొన్ని అంశాలున్నాయని చెప్పారు. ఈ సదస్సు సందర్భంగా జరిగే చర్చల్లో కొన్ని నేరుగా పెట్టుబడులకు దారి తీస్తాయని, మరికొన్ని ముందుకెళ్ళేందుకు దారి చూపిస్తాయని పేర్కొన్నారు.

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × four =