తెలంగాణ రాష్ట్రప్రభుత్వం కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం నాడు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మం నియోజకవర్గంలోని లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. 207 మంది లబ్ధిదారులకు రూ.2.07 కోట్ల రూపాయల కళ్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సహకారంతో నేటి వరకు ఖమ్మం నియోజకవర్గం పరిధిలో 4713 కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకుగాను రూ.41.28 కోట్ల విలువైన చెక్కులను పంపిణీ చేసినట్టు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ మహిళలకు అండగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, ఖమ్మం మేయర్ పాపాలాల్, ఇతర నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ