రాజ్యసభలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా రాజ్యసభ ఎంపీ కేఆర్ సురేశ్రెడ్డి నియమితులయ్యారు. టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభాపక్ష ఉపనేతగా కేఆర్ సురేశ్రెడ్డిని నియమిస్తూ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని, ఈ నియామకం తక్షణమే అమల్లోకి రానున్నట్టు టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు మంగళవారం మీడియాకు తెలిపారు. ఈ మేరకు ఆయన పార్లమెంట్ కార్యదర్శికి లేఖ కూడా రాశారు. రాజ్యసభలో టీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా వ్యవహరించిన బండా ప్రకాశ్ ఇటీవలే ఎమ్మెల్సీగా ఎన్నిక అయిన సంగతి తెలిసిందే. దీంతో ఆ స్థానం ఖాళీ కావడంతో సురేశ్రెడ్డిని నియమిస్తూ సీఎం కేసీఆర్ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. 2018లో టీఆర్ఎస్ పార్టీలో చేరిన సురేశ్రెడ్డి, పార్టీ తరపున 2020లో రాజ్యసభకు ఎంపికయ్యారు. తనను డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా ఎంపిక చేసినందుకు గానూ సీఎం కేసీఆర్ కు సురేశ్రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ