భారత దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు పూర్తవుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ‘స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం’ కార్యక్రమాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఆగస్టు 8 నుంచి 22 వరకు జరిగే కార్యక్రమాలు, వాటి అమలు తీరుపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాజ్యసభ ఎంపీ కె.కేశవరావు నేతృత్వంలోని కమిటీ సభ్యులు, ఇతర ముఖ్యులతో ప్రగతి భవన్ లో మంగళవారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశం సందర్భంగా ‘స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం’ లో నిర్వహించే రోజు వారీ కార్యక్రమాల వివరాలను వెల్లడించారు.
స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం: రోజువారీ కార్యక్రమాల షెడ్యూల్
- ఆగస్టు 08: స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం ప్రారంభోత్సవ కార్యక్రమాలు
- ఆగస్టు 09: ఇంటింటికీ జాతీయ పతాకాల పంపిణీ ప్రారంభోత్సవం
- ఆగస్టు 10: వజ్రోత్సవ వన మహోత్సవంలో భాగంగా గ్రామ గ్రామాన మొక్కలు నాటడం, ఫ్రీడం పార్కుల ఏర్పాటు
- ఆగస్టు 11: ఫ్రీడం రన్ నిర్వహణ
- ఆగస్టు 12: రాఖీ పండుగ సందర్భంగా వివిధ మీడియా సంస్థల ద్వారా ప్రత్యేక వజ్రోత్సవ కార్యక్రమాల ప్రసారాలకు విజ్జప్తి
- ఆగస్టు 13: విద్యార్థులు, యువకులు, మహిళలు, వివిధ సమాజిక వర్గాల భాగస్వామ్యంతో వజ్రోత్సవ ర్యాలీలు
- ఆగస్టు 14: సాయంత్రం సాంస్కృతిక సారథి కళాకారుల చేత నియోజకవర్గ కేంద్రాల్లో ప్రత్యేక సాంస్కృతిక జానపద కార్యక్రమాలు, ప్రత్యేకంగా బాణాసంచాతో వెలుగులు విరజిమ్మడం
- ఆగస్టు 15: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
- ఆగస్టు 16: ఏక కాలంలో, ఎక్కడివారక్కడ ’తెలంగాణ వ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన. సాయంత్రం కవి సమ్మేళనాలు, ముషాయిరాల నిర్వహణ
- ఆగస్టు 17: రక్తదాన శిబిరాల నిర్వహణ
- ఆగస్టు 18: ‘ఫ్రీడం కప్’ పేరుతో క్రీడల నిర్వహణ
- ఆగస్టు 19: దవాఖానాలు, వృద్ధాశ్రమాలు, అనాథ శరణాలయాలు, జైల్లలో ఖైదీలకు పండ్లు, స్వీట్ల పంపిణీ
- ఆగస్టు 20: దేశభక్తిని, జాతీయ స్ఫూర్తిని ప్రకటించే విధంగా ముగ్గుల పోటీలు
- ఆగస్టు 21: అసెంబ్లీ ప్రత్యేక సమావేశం, దాంతో పాటు ఇతర స్థానిక సంస్థల ప్రత్యేక సమావేశం
- ఆగస్టు 22: ఎల్బీ స్టేడియంలో వజ్రోత్సవ ముగింపు వేడుకలు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY