తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు (సెప్టెంబర్ 6, మంగళవారం) ఉదయం ప్రారంభమయ్యాయి. మంగళవారం ఉదయం 11.30 గంటలకు శాసనసభ సమావేశాలను స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, శాసనమండలి సమావేశాలను చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రారంభించారు. శాసనసభకు సీఎం కేసీఆర్, రాష్ట్రమంత్రులతో పాటు సభ్యులు హాజరయ్యారు. ఈ సమావేశాల్లో భాగంగా ముందుగా ఇటీవల మరణించిన మాజీ శాసనసభ్యులకు సభ సంతాపం ప్రకటించింది. తుంగతుర్తి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం, కమలాపూర్ నియోజకవర్గం మాజీ సభ్యుడు పరిపాటి జనార్దన్రెడ్డి మృతి పట్ల స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సభ్యులు రెండు నిమిషాల పాటుగా మౌనం పాటించారు. సంతాప తీర్మానాల అనంతరం సభను వచ్చే సోమవారం (సెప్టెంబర్ 12వ తేదీ) ఉదయం 11 గంటలకు వాయిదా వేస్తునట్టుగా స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి ప్రకటించారు.
ఆ తర్వాత శాసనసభలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన సభా వ్యవహారాల నిర్వహణ కమిటీ (బీఏసీ) సమావేశం జరుగుతుంది. ఈ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన ఎజెండా, సభ నిర్వహణ రోజులను బీఏసీ సమావేశంలో ఖరారు చేయనున్నారు. మరోవైపు ఈ సమావేశాల్లో పురపాలక చట్టసవరణ సహా ఆరు బిల్లులు మరియు 16, 17, 18 తేదీల్లో నిర్వహించే తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రాత్సవాల ప్రారంభ వేడుకలు, సంక్షేమ పథకాలు, ఇతర రాష్ట్ర సంబంధిత అంశాలపై కీలకంగా చర్చించనున్నట్టు తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY