మునుగోడు రాజకీయాలు, ఉప ఎన్నికలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గురువారం ప్రజా సంగ్రామ యాత్ర రెండో రోజులో భాగంగా భువనగిరిలో గురువారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. త్వరలో తెలంగాణలో మరిన్ని ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. అయితే ఈ ఉప ఎన్నికలకు కారణం టీఆర్ఎస్ నాయకులే అని, సుమారు 10 నుంచి 15 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రజల ద్వారా ఒత్తిడి తెప్పించుకుని రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
ఇక మునుగోడులో బీజేపీ పార్టీ తప్పక గెలుస్తుందని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో నాలుగు ఉప ఎన్నికలు జరుగగా, వాటిలో రెండు ఎన్నికల్లో గెలిచామని గుర్తు చేశారు. కాగా మునుగోడు ఎన్నిక తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికగా బండి సంజయ్ అభివర్ణించారు. ఇంతకుముందు కూడా అనేక సందర్భాల్లో కోమటి రెడ్డి బ్రదర్స్ బీజేపీని, మోదీ పథకాలను ప్రశంసించారని అన్నారు. అలాగే బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డాక జర్నలిస్టులకు అన్నిరకాల సౌకర్యాలు కల్పిస్తామని, రైల్వే పాసులు, సొంత ఇళ్ళు కల్పిస్తామని బండి హామీ ఇచ్చారు. అలాగే ‘ఆయుష్మాన్ భారత్’లో జర్నలిస్టులను చేర్చే విషయంపై చర్చిస్తానని కూడా బండి సంజయ్ వెల్లడించారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. చికోటి ప్రవీణ్ రెడ్డికి సంబంధించిన క్యాసినో వ్యవహారంలో చాలా మంది అధికార పార్టీకి చెందిన నాయకులున్నారని, దీనిలో కేసీఆర్ కుటుంబ సభ్యుల పాత్ర ఉందని, అందుకే దీనిని కూడా డ్రగ్స్ స్కామ్ లాగే పక్కదారి పట్టించేందుకు కుట్ర జరుగుతోందని సంజయ్ ఆరోపించారు. వచ్చే ఎన్నికల వరకు ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగుతుందని, మధ్యలో ఆపేది లేదని స్పష్టం చేశారు. ఈ పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకొని వాటినే తమ మ్యానిఫెస్టోలో పెడతామని బండి సంజయ్ తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY