నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘనవిజయం సాధించింది. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నోముల భగత్ కుమార్ 18872 వేలకుపైగా మెజార్టీతో గెలుపొందారు. కౌంటింగ్ మొదటినుంచి టీఆర్ఎస్ తిరుగులేని ఆధిపత్యాన్ని చూపిస్తూ విజయంవైపు దూసుకొచ్చింది. 25 రౌండ్ల తర్వాత పోస్టల్ ఓట్లతో కలిపి టీఆర్ఎస్ కు 89804 ఓట్లు, కాంగ్రెస్ కు 70932 ఓట్లు, బీజేపీకి 7676 ఓట్లు పోలయ్యాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జానారెడ్డి రెండో స్థానంలో నిలవగా, మరోవైపు బీజేపీ పార్టీ కనీస స్థాయిలో కూడ ప్రభావం చూపలేక పోయింది.
ఈ ఎన్నికల బరిలో మొత్తం 41 మంది అభ్యర్థులు నిలిచారు. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఈ ఉపఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావించి పోటా పోటీగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించడంతో తుది ఫలితాలపై ప్రజల్లో ఆసక్తి నెలకుంది. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ పక్క ప్రణాళికతో పార్టీ నాయకులుకు దిశానిర్దేశం చేయడంతో ఈ పోరులో టీఆర్ఎస్ పార్టీ అద్భుత విజయాన్ని దక్కించుకుంది. నోముల భగత్ గెలుపుతో తెలంగాణ భవన్ వద్ద నాయకులు, కార్యకర్తలు స్వీట్లు పంచుకుంటూ, ఆనందంలో మునిగిపోయారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ