తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఆగస్టు 5, బుధవారం మధ్యాహ్నం 2:00 గంటలకు ప్రగతి భవన్ లో రాష్ట్ర కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. రాష్ట్రంలో కరోనా నియంత్రణ, కరోనా నేపథ్యంలో విద్యారంగంలో తీసుకోవాల్సిన చర్యలు, నియంత్రిత సాగు పద్ధతిలో వ్యవసాయం, సెక్రటేరియట్ నూతన భవన సముదాయ నిర్మాణంపై ఈ సమావేశంలో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. అలాగే కృష్ణా జలాల అంశం, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ తదితర అంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu