ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్ లో నేటి (జూన్ 19, శనివారం) మధ్యాహ్నం 2 గంటలకు అత్యవసర రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో లాక్డౌన్, వర్షపాతం, వానాకాలం సాగు, వ్యవసాయం సంబంధిత సీజనల్ అంశాలు, గోదావరిలో నీటిని లిఫ్టు చేసే అంశం, హైడల్ పవర్ ఉత్పత్తి, తదితర అంశాలపై కేబినెట్ చర్చించనుంది.
అలాగే నేటితో రాష్ట్రంలో అమల్లో ఉన్న లాక్డౌన్ గడువు ముగియనుండడంతో కేబినెట్ సమావేశంలో చర్చించి, తదుపరి నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తుంది. రాష్ట్రంలో లాక్డౌన్ కొనసాగిస్తారా లేక సడలింపు సమయం పెంచుతారా లేదా నైట్ కర్ఫ్యూ అమలు చేయనున్నారా అనే దానిపై కేబినెట్ సమావేశం అనంతరం స్పష్టత రానుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ