ఈ నెల 18,19 వ తేదీల్లో తెలంగాణ శాసన సభ, శాసన మండలి ప్రత్యేకంగా సమావేశం కానుంది. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా రూపొందించిన పురపాలక చట్టాలను (మునిసిపల్ బిల్లు) ఆమోదించడానికి రెండురోజుల పాటు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం, జూలై 17 న రాష్ట్ర కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆధ్వర్యంలో, సాయంత్రం నాలుగు గంటలకు ప్రగతి భవన్ లో ఈ సమావేశం జరగనుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ కే జోషి సోమవారం నాడు వెల్లడించారు.
బుధవారం సమావేశమయ్యే రాష్ట్ర మంత్రివర్గం, కొత్త మున్సిపల్ ముసాయిదా బిల్లును ఆమోదించడం, మునిసిపల్ ఎన్నికల నిర్వహణ, ఇతర ముఖ్యమైన నిర్ణయాలపై చర్చించనున్నారు. శాసన సభలో ప్రవేశపెట్టే మునిసిపల్ బిల్లును ముందుగా రాష్ట్ర కేబినెట్ ఆమోదించవలసి ఉంది, జిహెచ్ఎంసి,హెచ్ఎండిఎ, ఇతర నగర పాలక సంస్థలు, మునిసిపాలిటీలకు సంబంధిన బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. కొత్తగా రూపొందిన చట్టం అమలులోకి వచ్చిన తరువాతనే తెలంగాణాలో మునిసిపల్ ఎన్నికలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఇదే సమావేశంలో నూతనంగా నిర్మించబోయే సచివాలయం,అసెంబ్లీ లపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్టు సమాచారం.
[subscribe]
[youtube_video videoid=ulgwfk7YZyo]