తెలంగాణలో 73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. గోల్కొండ కోటలో 73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు ఘనంగా చేసారు. నగరంలోని చారిత్రాత్మక గోల్కొండ కోటకి చేరుకొని తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్రావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆ తరువాత పోలీసుల గౌరవందనాన్ని ముఖ్యమంత్రి స్వీకరించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలందరికీ 73వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసారు. రాష్ట్ర మంత్రులు, పార్టీ నేతలు, ఉన్నతాధికారులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం ప్రజలనుద్దేశించి సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు.
[subscribe]
[youtube_video videoid=sYVduRoPK9w]