తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుక్రవారం జార్ఖండ్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ముందుగా రాంచీ చేరుకున్న సీఎం కేసీఆర్ గిరిజన ఉద్యమనేత బిర్సా ముండా విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం రాంచీలో సీఎం కేసీఆర్ కు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ఘనంగా స్వాగతం పలికారు. సీఎం హేమంత్ సోరెన్ నివాసంలో ఇరువురూ సీఎంలు సమావేశమై తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ఈ సమావేశంలో జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ అధినేత శిబూ సోరేన్ తో పాటుగా సీఎం కేసీఆర్ వెంట వెళ్లిన ప్రతినిధుల బృందంలోని మంత్రి శ్రీనివాస్ గౌడ్, టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, తదితరులు పాల్గొన్నారు.
ఇక సీఎం హేమంత్ సోరెన్ తో భేటీ తర్వాత గతేడాది గాల్వాన్ లోయలో చైనాతో జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన జార్ఖండ్ కు చెందిన ఇద్దరు అమర జవాన్ల కుటుంబాలకు సీఎం కేసీఆర్ ఆర్థిక సహాయం అందజేశారు. ముందుగా సీఎం హేమంత్ సోరెన్ తో కలిసి జవాన్ల కుటుంబాలను సీఎం కేసీఆర్ పరామర్శించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున అమర జవాన్ కుందన్ కుమార్ ఓజా భార్య నమ్రత కుమారికి, మరో వీర జవాన్ గణేష్ కుటుంబ సభ్యులకు చెరో రూ.10 లక్షల చెక్ లను సీఎం కేసీఆర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సహా పలువురు జార్ఖండ్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ