తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. సీఎం కేసీఆర్ వ్యక్తిగత వైద్యుడు ఎం.వి రావు ఆధ్వర్యంలోని వైద్య బృందం మంగళవారం సీఎంకు కరోనా పరీక్షలు నిర్వహించారు. రాపిడ్ యాంటీజెన్ తో పాటు ఆర్టీపీసీఆర్ పరీక్షలు రెండింటిలోనూ రిపోర్టులు నెగిటివ్ గా వచ్చాయని తెలిపారు. రక్తపరీక్షల రిపోర్టులు కూడా సాధారణంగా వున్నాయని తేలింది. దీంతో సీఎం కేసీఆర్ కరోనా నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నట్టుగా వైద్యులు నిర్ధారించారు.
ముందుగా ఏప్రిల్ 19న స్వల్ప లక్షణాలతో సీఎం కేసీఆర్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైద్యుల సూచనల మేరకు అప్పటినుంచే సీఎం కేసీఆర్ తన ఫామ్ హౌస్లో ఐసోలేషన్ లో ఉన్నారు. వైద్యుల బృందం సీఎం కేసీఆర్ ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. ఈ క్రమంలో తాజాగా నిర్వహించిన పరీక్షల్లో రిపోర్టులు నెగటివ్ గా వచ్చాయని, సీఎం కేసీఆర్ కరోనా నుంచి కోలుకున్నారని వైద్యులు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ