మల్కాజ్ గిరి కాంగ్రెస్ ఎంపీ, టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కి మార్చ్ 18, బుధవారం నాడు బెయిల్ మంజూరు అయింది. నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్ కెమెరాలను ఉపయోగించారనే ఆరోపణలతో రేవంత్ రెడ్డిని మార్చ్ 5వ తేదీన నార్సింగి పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం రేవంత్ రెడ్డిని మియాపూర్ కోర్టులో హాజరు పరచగా 14 రోజులపాటు కోర్టు రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ను చర్లపల్లి జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో బెయిల్ కోసం రేవంత్ రెడ్డి మొదట కూకట్ పల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా కోర్టు ఆ పిటిషన్ ను తోసిపుచ్చింది. ఆ తరువాత ఆయన హైకోర్టును ఆశ్రయించారు. మియాపూర్ కోర్టు విధించిన రిమాండ్ రద్దు చేయాలని, అలాగే పార్లమెంట్ సమావేశాలకు హాజరుకావాల్సి ఉండగా బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్స్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై ఈ రోజు విచారణ జరిపిన హైకోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Home తెలంగాణ
- Advertisement -