భారత స్వాతంత్య్ర 75వ వార్షికోత్సవ వేడుకల విజయవంతానికి అన్ని ఏర్పాట్లు చేయాలి: సీఎస్

75th Anniversary of Independence, 75th Anniversary of Independence Day, 75th Anniversary of Independence Day Celebrations, Celebrations of Commemoration of 75th Anniversary of Independence, Commemoration of 75th Anniversary of Independence, CS Somesh Kumar, Independence Day Celebrations, Mango News, Telangana CS, Telangana CS Meeting on Celebrations of Commemoration of 75th Anniversary of Independence, Telangana CS Somesh Kumar, Telangana Independence Day Celebrations

భారత స్వాతంత్య్ర 75 వ వార్షికోత్సవ వేడుకలను విజయవంతం చేయుటకు అన్ని ఏర్పాట్లు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. మార్చి 11, 12 తేదీల్లో అన్ని ప్రభుత్వ భవనాలు, జంక్షన్లను విద్యుత్ బల్బులతో కాంతులీనేలా అలంకరించాలని తెలిపారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు భారత స్వాతంత్య్ర 75 వ వార్షికోత్సవ ఏర్పాట్లపై మంగళవారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో అధికారులతో సమావేశం నిర్వహించారు.

వేడుకల ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా మార్చి 12 న ఉదయం 11.00 గంటలకు పబ్లిక్ గార్డెన్స్, నాంపల్లి లో సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. అలాగే వరంగల్ లో జరిగే వేడుకల్లో రాష్ట్ర గవర్నర్ డా.తమిళిసై సౌందరరాజన్ పాల్గొననున్నారు. ఈ సమీక్షా సమావేశంలో డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి, జి.ఎ.డి.(పోలిటికల్) ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, హైదరాబాద్ పోలీస్ కమీషనర్ అంజనీ కుమార్, గవర్నర్ సెక్రటరీ సురేంద్ర మోహన్, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ కార్యదర్శి కె.ఎస్.శ్రీనివాస రాజు, జి.హెచ్.యం.సి కమీషనర్ లోకేశ్ కుమార్, హెఛ్ఎంఎంఎస్ అండ్ ఎస్బీ మేనేజింగ్ డైరెక్టర్ దాన కిషోర్, టీఎస్ఎస్పీడిసిఎల్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ రఘుమారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 + 19 =