జీవకోటికి ప్రాణవాయువును అందించే చెట్లను నాటడం మనందరి బాధ్యత అని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్ కుమార్ అన్నారు. ఈ రోజు తన పుట్టిన రోజును పురస్కరించుకుని “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” లో భాగంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్డు లోని సంజీవయ్య పార్కులో సీఎస్ సోమేశ్ కుమార్ మొక్కను నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, సమాజం పట్ల బాధ్యత, భవిష్యత్ తరాల బాగుకోసం, ప్రకృతి పట్ల అవగాహనతో రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన ఈ మొక్కల యజ్ఞం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అద్భుతమైన కార్యక్రమం అని అన్నారు. తనకు తెలిసి భారతదేశ చరిత్రలో ఇంత భారీయెత్తున మొక్కలు నాటే కార్యక్రమం, సంస్థ ఇంకోటి లేదంటే అతిశయోక్తి కాదన్నారు.
ప్రకృతిపట్ల ఆరాధనతో చేస్తున్న జోగినిపల్లి సంతోష్ కుమార్ తీసుకున్న ఈ వనయజ్ఞంలో ప్రజలంతా స్వచ్ఛందంగా మొక్కల నాటడం, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మానసపుత్రిక అయిన “హరిత హారానికి” మరింత ముందుకు తీసుకుపోతుందన్నారు. ఇంత మంచి కార్యక్రమానికి రూపకల్పన చేసి, తన పుట్టిన రోజున ఈ కార్యక్రమంలో పాల్గోనే అవకాశం కల్పించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆద్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ కు సీఎస్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రతీ ఒక్కరు “హరిత హారం”లో, అదే విధంగా “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” లో పాల్గొని మొక్కలు నాటాలని ప్రజలకు సీఎస్ సోమేశ్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో-ఫౌండర్ రాఘవేందర్ యాదవ్, హెచ్ఎండీఏ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE