దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ విజయవంతంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా ఏప్రిల్ 1 నుంచి 45 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేసే కార్యక్రమం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. పుదుచ్చేరిలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ మహిళా, శిశువుల ఆస్పత్రిలో శుక్రవారం నాడు గవర్నర్ మొదటి డోసు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు.
ముందుగా సెలవుదినాలుతో సహా అన్ని రోజులలో మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మహిళల కరోనా వ్యాక్సినేషన్ సెంటర్ ను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రారంభించారు. అనంతరం రిజిస్ట్రేషన్ చేసుకున్న ఇతర మహిళలతో కలిసి గవర్నర్ వ్యాక్సిన్ తీసుకున్నారు. కరోనా రహిత దేశం కోసం 45 ఏళ్లు పైబడిన అర్హత ఉన్న పౌరులందరూ కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని ఈ సందర్భంగా తమిళిసై సౌందరరాజన్ విజ్ఞప్తి చేశారు.
I got vaccinated in RG govt hospital puducherry alongside others enrolled in Women’s Vaccination center inaugurated today for women exclusively on all days including holidays #vaccinationdrive. Join me to vaccinate all eligible citizens above 45 yrs soon for #Corona free Nation pic.twitter.com/x7zAWvSD0H
— Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) April 2, 2021
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ