కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో లాక్డౌన్ ను మే 29 వరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అన్ని కోర్టులు, ట్రైబ్యునళ్లను కూడా లాక్డౌన్ను మే 29 వరకు పొడిగిస్తూ ఈ రోజు తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అప్పటివరకు జిల్లా, మేజిస్ట్రేట్ కోర్టులు, ట్రైబ్యునళ్లు మరియు ఇతర న్యాయ సంబంధిత సంస్థలు పనిచేయవని పేర్కొన్నారు. ఏదైనా అత్యవసర కేసులు వస్తే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించనున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపారు. హైకోర్టులో కూడా సాధారణ న్యాయ, పరిపాలనకు సంబంధించిన అన్ని కార్యకలాపాలను కూడా మే 29వరకు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అత్యవసర కేసులు, విచారణ తుది దశకు చేరుకున్నవి, అడ్మిషన్ పెండింగ్ కేసుల విచారణను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తులు చేపడతారని హైకోర్టు స్పష్టం చేసింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu