కరోనా వ్యాప్తి నేపథ్యంలో కాలేజీల్లో తరగతుల నిర్వహణ ఆలస్యమవుతుండడం, ఇప్పటికే కొంత విద్యా సంవత్సరం కోల్పోయిన నేపథ్యంలో తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. 2020-21 విద్యా సంవత్సరానికి గానూ ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో 30 శాతం సిలబస్ను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. సైన్స్ సబ్జెక్టుల్లో సీబీఎస్ఈ తొలగించిన పాఠాలనే కుదించినట్లు తెలిపారు.
ఇంటర్ ప్రథమ సంవత్సరం తెలుగు సబ్జెక్ట్లో 30 శాతం, ద్వితీయ సంవత్సరంలో జియోగ్రఫ్రీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, కామర్స్, అకౌంట్స్, హిస్టరీ, ఏకనామిక్స్, సివిక్స్ సబ్జెక్టులలో సెలబస్ను తగ్గించినట్టు ఇంటర్బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ వెల్లడించారు. 30 శాతం సిలబస్ కుదింపు కేవలం ఈ విద్యా సంవత్సరానికే పరిమితమని చెప్పారు. అలాగే తగ్గించిన సిలబస్ ఆధారంగానే ఇంటర్ వార్షిక పరీక్షలు, అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో ప్రశ్న పత్రాలు ఉంటాయని పేర్కొన్నారు. మరోవైపు 2020–21 విద్యా సంవత్సరానికి గానూ సీబీఎస్ఈ బోర్డు, ఏపీ ఇంటర్ బోర్డు కూడా 30 శాతం సిలబస్ కుదించాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu