రాష్ట్రంలో అమలవుతున్న రైతు భీమా పథకంపై తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా కీలక వివరాలు వెల్లడించారు. దేశంలో దాదాపు 40 లక్షల మంది రైతులకు రూ.5 లక్షల జీవితబీమా కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఓ రైతు (బీజేపీ కార్యకర్త) ఇంటికి వెళ్లి రైతు భీమా చెక్కును ఆ కుటుంబానికి అందజేసిన చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్కు మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు.
“తెలంగాణ రైతు కుటుంబాలకు సీఎం కేసీఆర్ ఆలోచనలోంచి పుట్టిన రైతు బీమా పథకం ఎంతగానో ఉపయోగపడుతూ పెద్దపీట వేసింది. ఇప్పటి వరకు 95,416 కుటుంబాలకు రైతు బీమా కింద ఒక్కొక్కరికి రూ.5 లక్షలు అందజేశాం. అలాగే రైతు భీమా కింద ఇప్పటివరకు పంపిణీ చేసిన మొత్తం సహాయం రూ.4770.80 కోట్లు” అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE