కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసి) బిల్లు 2019 ను వ్యతిరేకిస్తూ, అందులో అభ్యంతరకరంగా ఉన్న సెక్షన్ 32, సెక్షన్ 50 లను వెంటనే తొలగించాలని, అంతవరకు విధులు బహిష్కరిస్తామని తెలంగాణ జూనియర్ డాక్టర్ల సంఘం స్పష్టం చేసింది. గత రెండు రోజుల నుండి ఓపీ సేవలుకు దూరంగా ఉండి నిరసన తెలుపుతున్న వైద్యులు, ఈ రోజునుంచి అత్యవసర వైద్య సేవలను కూడ బహిష్కరించాలని నిర్ణయించుకున్నారు. గాంధీ ఆసుపత్రిలో వెయ్యిమందికిపైగా జూనియర్ డాక్టర్లు, మూడు రోజులుగా సమ్మెలో పాల్గొంటున్నారు.
నిమ్స్ ఆసుపత్రిలో గురువారం ఓపీ సేవలు కొనసాగించినా, శుక్రవారం ఓపీ సేవలును బహిష్కరించారు. నిమ్స్ ప్రాంగణంలో నిమ్స్ రెసిడెంట్ వైద్యుల బృందం ధర్నా చేపట్టింది. ఎన్ఎంసి బిల్లు-2019 పేద వైద్య విదార్థులకు, సామాన్య రోగులకు పూర్తిగా వ్యతిరేకంగా ఉందని, ప్రభుత్వం వెంటనే బిల్లులో మార్పులు చేయాలనీ వారు కోరారు. ఇలా వైద్యులు సమ్మె బాట పట్టడంతో రోగులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. ఉస్మానియా,నిలోఫర్ ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడ వైద్యులు నిరసనకు దిగడంతో అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రికి వచ్చిన రోగులకు వైద్యం అందకపోవడంతో ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తున్నారు. జూనియర్ డాక్టర్ల ఆందోళన తీవ్రరూపం దాల్చడంతో ప్రభుత్వం దృష్టి సారించాలని ప్రజలు కోరుకుంటున్నారు.
[subscribe]
[youtube_video videoid=D_GP-Q0KT7E]